విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కేజీహెచ్ అఫీషియల్ కాలనీ మొదటి లైన్లో వినాయక నిమజ్జనంలో చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసిందని సీఐ భాస్కరరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బాబూజీ కొండా రంగిరీజు వీధిలో నివాసం ఉంటున్న బర్నిక రాము(35)ను సతీశ్ మరో ఇద్దరితో కలిసి కత్తులతో పొడిచి చంపినట్లు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

previous post
next post