విశాఖపట్నం వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో కోటవీధి ఏరియా, ఖాజా మొహియుద్దీన్ బిల్డింగ్ ఆఫ్రో సంస్థ ఆఫీసు ప్రక్కన హాల్ లో 45 రోజుల జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లి సింహాచలం, కనక మహాలక్ష్మి దేవస్థానం, మాజీ చైర్మన్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ శిక్షణా ఎంతో ఉపయోగపడుతుంది అని అంతేకాకుండా ఈ జ్యూట్ సంచులు వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించి పర్యావరణానికి మేలు చేయడం జరుగుతుంది అని ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క మహిళా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ లక్ష్మీ, వేదాంత-వి.జి.సి.బి పోర్టు సి.ఎస్.ఆర్ హెడ్ మాట్లాడుతూ ఈ 45 రోజుల జ్యూట్ బ్యాగ్స్ తయారీ శిక్షణా కార్యక్రమం లో ప్రతీ ఒక్క మహిళా నైపుణ్యాన్ని పెంచుకుని స్వంతంగా బ్యాగ్స్ కుట్టడం నేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి 43 మంది మహిళలు శిక్షణా తీసుకోడానికి రావడం జరిగింది మరియు స్థానిక మహిళా నాయకురాలు రమణమ్మ, ఆఫ్రో ప్రాజెక్టు మేనేజర్ విజయ భాస్కర్, ఎఫ్.టీ అనిల్, ఆశ, ట్రైనర్ జయలక్ష్మి పాల్గొన్నారు.

previous post