Tv424x7
Andhrapradesh

టీడీపీ నేత వంగవీటి రాధాకు అస్వస్థత

అమరావతి:సెప్టెంబర్ 26 మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో… వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరసం లేదంటున్నారు వైద్యులు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. మరోవైపు రాధా గుండె పోటుకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమా నులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఆయన ఇంటి వద్దకు వెళ్లి వివరాలను కనుక్కుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Related posts

వేధిస్తున్నాడని కొడుకును హత్య చేసిన తండ్రి..

TV4-24X7 News

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TV4-24X7 News

నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చలారని పసి బాలుడు మృతి

TV4-24X7 News

Leave a Comment