విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి వేటకువెళ్ళి, ఈరోజు తెల్ల వారు జామున 4గంటల సమ యంలో పూడిమడక సమీ INDRAP-V5-22- 294 గల బోటు అగ్నికి ఆహుతై, దగ్ధమైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు బాధితులను కలసి వారికి ప్రభుత్వం నుంచి సహ కారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో 37 వార్డ్ అధ్యక్షులు మరియు మత్స్యకార నాయకులు రవి, బోటు ఓనర్ బడే సూర్యనారా యణ, తోటయ్య, మసేనమ్మ పాల్గొన్నారు.
