Tv424x7
Andhrapradesh

ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ కు ఘన సత్కారం గంట్ల

విశాఖపట్నం ఉత్తరాంధ్రలో చిన్న పరిశ్రమలను మరింత అభివృద్ధి చేయాలి శివశంకర్ ను సత్కరించిన గంట్ల రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొ రేషన్ చైర్మన్ గా నియ మించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ ను సోమవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విశాఖ విమానాశ్రయ అంతర్జాతీయ సలహా మండల సభ్యులు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివ శంకర్ ను సత్కరించి సింహాద్రినాదుని జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గంట్ల శ్రీనుబాబు మాట్లా డుతూ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంతటి కీలకమైన పదవులు దక్కడం అభినందనీయమన్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శివశంకర్ కు దక్కిన పదవి పట్ల పార్టీ నాయకులు కార్యకర్తలుతో పాటు పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Related posts

దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా రాట కార్యక్రమం లో పాల్గొన్న కందుల

TV4-24X7 News

ఘర్షణలు లేకుండా ఎవరి ఓటును వారే వినియోగించుకోవాలి : డి.ఎస్.పి వెంకటేసులు

TV4-24X7 News

జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులలో మరింత జాప్యం..

TV4-24X7 News

Leave a Comment