Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ని కలిసిన జనసేన పార్టీ శ్రేణులు

విశాఖపట్నం స్వచ్ఛత భాగిదారి లో విశాఖ మొదటి స్థానంలో నిలిపి,ప్రత్యేక చొరవ చూపిస్తున్న కమిషనర్ కి ఎమ్మెల్యే వంశీకృష్ణ జనసేన శ్రేణులు ఘన సన్మానం. గురువారం జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ని విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విశాఖ జనసేన పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్చార్జి లు, కార్పొరేటర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు కమిషనర్ కి శాలువా వేసి, పూలబొకే అందజేశారు. అనంతరం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. వార్డ్ పరిధిలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వివిధ నియోజకవర్గాల ఇన్చార్జీలు ఉషాకిరణ్, సందీప్, శివ ప్రసాద్ రెడ్డి, జి.వి.ఎం.సి ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి జీకే, కార్పొరేటర్లు నాగరాజు, గోవింద రెడ్డ, ఉష, సూర్య కుమారి, కామేశ్వరి, పుర్రె సురేష్ పాల్గొన్నారు.

Related posts

తొలి సినిమా హీరోయిన్‌తో డిప్యూటీ సీఎం ప‌వ‌న్

TV4-24X7 News

అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?

TV4-24X7 News

ఒరిస్సా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు

TV4-24X7 News

Leave a Comment