విశాఖపట్నం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ను శనివారం ఉదయం వారి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న రాజకీయపరమైన అంశాలపై కాసేపు మాట్లాడుకున్నారు. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి, వైసీపీ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పలు విషయాలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. భవిష్యత్తులో వైసిపి పార్టీ మళ్లీ పూర్వవైభం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.
