విశాఖపట్నం రొమ్ము క్యాన్సర్ వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు అన్నారు. కేజీహెచ్ మెడికల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్పా ఆధ్వర్యంలో శనివారం విభాగ ఆవరణలో బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రత్యేక అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తించిన నేపధ్యంలో ఈ నెల రోజుల పాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉచితంగా అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ పి. శివానంద మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా క్యాన్సర్ కేర్ యూనిట్లల్లో ఒక్క కేజీహెచ్లోనే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలందుతున్నాయన్నారు. మెడికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ ఇద్దరు వైద్యులు కూడా రోగుల పట్ల అధిక శ్రద్ద చూపించి వారికి సకాలంలో మెరుగైన సేవలందించడం అభినందనీయమన్నారు. మెడికల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్ప మాట్లాడుతూ 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి విధిగా క్యాన్సర్ కారకమైన అన్ని వైద్యపరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ అవగాహణ కార్యక్రమాల్లో భాగంగా నెల రోజుల పాటు మహిళలకు ఉచితంగా ఎంతో ఖరీదైన మోమోగ్రఫీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షను ఉచితంగా చేసి, లక్షణాలు ఉన్న వారికి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆపోహలు విడనాడి సకాలంలో వైద్యసేవలు పొందాలని, ఏ రకం క్యాన్సర్నైనా ముందస్తుగా గుర్తించి వైద్యం అందిస్తే కొంత మేర నివారించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో రేడియేషన్ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు, మెడికల్ అంకాలజీ విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.. ముందుగా క్యాన్సర్పై అవగాహన కల్పించేలా బెల్లూన్లు గాలిలోకి ఎగరవేశారు.

previous post