విశాఖపట్నం 32 వ వార్డు పూతివారిమాన్యం జనసేన వీర మహిళ పి విజయలక్ష్మి మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో శ్రీ విజయ దుర్గ దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ కందుల నాగరాజు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బయన సునీల్, వానపల్లి గాయత్రీ దేవి,చిట్టమ్మ, పుష్ప,బుజ్జి,దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు, 32వ వార్డ్ ఇంచార్జ్ కందుల బద్రీనాథ్, జన సైనికులు వీర మహిళలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
