విశాఖపట్నం వేదాంత ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 39వ వార్డ్ పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న మత్స్యకార కమ్యూనిటీ హాల్లో అంగన్వాడి టీచర్స్, ఆయాలు, పిల్లలతో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. దీపావళిని పురస్కరించుకొని అంగన్వాడి టీచర్స్, ఆయాలకు గిఫ్ట్ లను అందజేయగా, అంగన్వాడి పిల్లలకు స్వీట్స్, చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లోని విజేతలకు ఐసిడిఎస్ సిడిపిఓ రమణికుమారి, శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం మాజీ చైర్మన్, సంఘ సేవకురాలు కొల్లి సింహాచలం, విజయ్ భాస్కర్ వేదాంత ప్రతినిధి శ్రీలక్ష్మి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. చిలకపేట ఒకటి, రెండు అంగన్వాడి కేంద్రాలకు గర్భిణీల సౌకర్యార్థం ఆరు కుర్చీలను అందజేశారు.
