విశాఖపట్నం చెన్నై లో జరిగిన అల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ -17 కేటగిరి లో ద్వితీయ స్థానం తొ పాటు, అల్ ఇండియా ర్యాంకింగ్ లో మొదటి స్థానం పొందిన మహారాణి పేట కు చెందిన ప్రగడ బాల ప్రణయ్ ను విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు , దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శివాజీ పాలెం కార్యాలయం లో అభినందించారు. ఈ సందర్భంగా మరిన్ని విజయాలు సాధించాలని, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారం వుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఎసిపి చుక్కా శ్రీనివాస్, షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.
