విశాఖపట్నం వివేకానంద సంస్థ సభ్యులు పీ ఎం సత్యనారాయణ మరియు వివేకనంద సభ్యులు ఆతృమూర్తులు పాలకొండ లక్ష్మమ్మ రుక్కేని ఆండాళ్ లు ఇటీవలే స్వర్గస్తులయ్యారు .వారికి వివేకానంద సంస్థ తరపున సంతాప సభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సంతాప సభ కార్యక్రమానికి ,ముఖ్యఅతిథిగా యువ నాయకులు ద్రోణంరాజు. శ్రీవాత్సవ పాల్గొని, కీర్తిశేషులు సత్యనారాయణ కి వివేకానంద సంస్థ సభ్యుల మాతృమూర్తులకు, వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివేకానంద సంస్థ వారు, సంస్థ సభ్యులు ఎవరు స్వర్గస్తులైన సభ్యుల సంతాప సభ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. స్వర్గస్తులైన వారికి కాశీ పుణ్యక్షేత్రంలో పిండ శాంతి పూజలు ప్రదానాలు చేసి వారి ఆత్మకు శాంతిని చేకూరుస్తున్నారు. తెలియజేశారు కార్యక్రమంలో జి రాము పీఎం సతీష్ మిత్రులు వివేకానంద సభ్యులు పాల్గొన్నారు.
