విశాఖపట్నం ఇటీవల టీటీడీ బోర్డు మెంబర్ గా నియామకమైన శ్రీ ఆనంద సాయి ని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు .అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్ర పటం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో అహర్నిశలు కృషి చేసిన సాయి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పెద్దలు , మాజీ కార్పొరేటర్ ఉమా మహేశ్వర రావు, జనసేన యువ నాయకులు సునీల్ పాల్గొన్నారు.

previous post