కడప /బి.మఠం: శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 416 జయంతి మహెూత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమై గణపతి పూజ కలస పూజలు నిర్వహించారు. 416 కలశాలతో మహిళలు మాడవీధుల గుండా ఉద్యానవనంలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి శిలా మూర్తికి అభిషేకాలు పాలు, పెరుగు నెయ్యి పంచదారలతో పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి వీరభద్ర స్వామి వీరంభట్లయ్య స్వామి దత్తాత్రేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఠం ఫిట్పర్సన్ 5ు శంకర్ బాలాజీ మేనేజర్ ఈశ్వర చారి రాత్రికి శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు _ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
