Tv424x7
Andhrapradesh

అమరావతిలో భూ కేటాయింపులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

అమరావతి: రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది..మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌, టీజీ భరత్‌ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు..గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేయనున్నారు. కొత్తగా వచ్చే సంస్థలకు చేయాల్సిన కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై కమిటీ చర్చించనుంది. గతంలో 120కి పైగా సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రాజధానిలో మళ్లీ భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తామని 115కు పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి..

Related posts

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

TV4-24X7 News

అది మార్ఫింగ్ వీడియో కావొచ్చు: పిన్నెల్లి లాయర్

TV4-24X7 News

Leave a Comment