విశాఖపట్నం ఈరోజు సుమారు 16.00 గంటలకు తెన్నేటి పార్క్ వద్ద ఎమ్.ఆర్.పేట ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ కోటీస్వరరావు విధులు నిర్వర్తిస్తుండగా పి.ఆర్ పేట వైపు నుండి జగదాంబ వైపు వస్తున్నా ఒక ఆటో తెన్నేటి జంక్షన్ వద్దకు వచ్చే సరికి ఆ ఆటో నుండి ఒక బ్యాగ్ పడిపోవడం గమనించి న హెడ్ కానిస్టేబుల్ ఆ బాగ్ ని తియ్యగా అందులో బంగారం మరియు వెండి వస్తువులు ఉండడం గమనించి మొబైల్ ఇంచార్జి ఎ ఎస్ ఐ శ్రీధర్ కి తెలియజేయగ అంతట అందులో వున్నా ఐడి కార్డు ఆధారముగా బ్యాగ్ పోగొట్టుకున్న ఆ మహిళకు ఫోన్ చెయ్యగా వారు వచ్చినారు.ఆ మహిళ పార్కు హోటల్ వద్ద వారి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యలో బ్యాగ్ పడిపోయినదని వారు తెలియ జెసినారు.అంతట ఎ ఎస్ ఐ శ్రీధర్ మరియు బీట్ హెడ్ కానిస్టేబుల్ కోటీస్వరరావు వారికీ బ్యాగ్ అందజేసినారు.ఆ బంగారు మరియు వెండి వస్తువుల విలువ సుమారు 60000 /- గా ఉంటుంది.

previous post