దేశంలో త్వరలోనే హైడ్రోజన్ తో నడిచే రైళ్లను భారత రైల్వే సంస్థ పట్టాలు ఎక్కించబోతోంది. హర్యానా లోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో తొలి హైడ్రోజన్ రైలును పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరులో ఈ ప్రయోగాత్మక పరిశీలన మొదలు కానుంది. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ హైడ్రోజన్ రైళ్లను తొలుత ప్రకృతి అందాలతో అలరారే హిల్ స్టేషన్లలోని రూట్లలో నడపాలని భారత రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
