ఏపీలో తిరుమలలో భక్తుల రద్దీ రెండ్రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్నటి మాదిరే ఇవాళ కూడా టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని నిన్న 58,165 మంది దర్శించుకోగా, 20,377 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

previous post