ప్రతి ఆహార సంబంధమైన వ్యాపారస్తుడు పోస్టాక్ శిక్షణా మరియు సర్టిఫికేషన్ పొంది ఉండాలి
ప్రొద్దుటూరు లో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్ విచ్చేసి ఈ పోస్టాక్ కార్యక్రమం ఉద్దేశిస్తూ ప్రతి వ్యాపారస్తుడు వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార భద్రత, నాణ్యత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కల్తీ లేని ఆహారం తయారు చేయాలని ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, కల్తీ ని గుర్తించాలని, ఫుడ్ కలర్స్, అజినోమోటో టేస్టీ సాల్టును వాడకూడదని ఫాస్టాక్ ట్రైనర్ యశోద దేవి వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కె వి జి వి ఎం సౌత్ ఇండియా ఇంచార్జ్ టి. సింధు, మోహన్ బాబు మరియు జిల్లా టీం హెడ్ నారుపల్లి శివదస్తగిరి రెడ్డి , జిల్లా వినియోగదారులు మరియు హోటల్, ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్ బేకరీ సమోసా జిలేబి స్వీట్స్ టీ స్టాల్స్ చిప్స్ చికెన్ పకోడా బజ్జీ సెంటర్స్, బిర్యానీ పాయింట్స్, జూస్ సెంటర్స్, మెస్సులు నిర్వహించున్నా యజమానులు, ప్రతినిధులు జిల్లా ఫుడ్ సేఫ్టీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.