Tv424x7
Andhrapradesh

శరన్నవరాత్రి అన్నప్రసాదానికి వాసుపల్లి రూ.10 వేలు విరాళం

విశాఖపట్నం భక్తులకు వడ్డించిన దక్షణ మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ మహారాణిపేటలో గల రామ జోగి పేట గల్లీ క్రికెట్ బాయ్స్ నిర్వహించనున్న శరన్నవరాత్రి మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10 వేలు విరాళం అందజేశారు. కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు అక్కడి 29వ వార్డు లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం భక్తులకు స్వహస్తాలతో వడ్డించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా గల్లీ క్రికెట్ బాయ్స్ వైభవంగా నిర్వహిస్తున్న వేడుకలు ఈ ఏడాది కూడా కన్నుల పండువుగా నిర్వహిస్తున్నారన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు దక్షిణ నియోజకవర్గ ప్రజలు, విశాఖపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోరాడ సురేష్ బుల్లెట్ రవి, తమ్మినేని శ్రీను, మహేష్, మూర్తి, అడప శివ వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి

TV4-24X7 News

అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ

TV4-24X7 News

Leave a Comment