Tv424x7
Telangana

ప్రభుత్వం కూల్చాలని ప్రతిపక్షాలు! పాలనపై దృష్టి పెట్టని ప్రభుత్వం!!

*బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు జతకట్టారని, అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. వాళ్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని రేవంత్‌రెడ్డి సర్కారుకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన సీపీఐ 100వ వార్షికోత్సవ బహిరంగ సభలో కూనంనేని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నిలబడాలనే ఉద్దేశంతోనే తాము మద్దతిచ్చామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్నా పాలనపై దృష్టిపెట్టలేదని అన్నారు. పద్ధతి మార్చుకుని ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని రేవంత్‌రెడ్డికి సలహాఇచ్చారు.

Related posts

కొత్త ఎమ్మెల్సీల నియామ‌కం… తెలంగాణ స‌ర్కార్ కు రిలీఫ్?

TV4-24X7 News

|| ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా ||

TV4-24X7 News

డ్రగ్స్ పై ఉక్కుపాదం!!

TV4-24X7 News

Leave a Comment