అమరావతి :ఏపీలో నర్సింగ్ కి 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.

previous post