విశాఖపట్నం 29 వ వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షులు అయినటువంటి ఊరుకుటి గణేష్ ఆధ్వర్యంలో సీతంరాజు సుధాకర్ యొక్క అదేశలు మేరకు నారా చంద్రబాబు నాయుడు యొక్క 76వ పుట్టినరోజు పండుగను పురస్కరించుకొని 29 వ వార్డు నందు గల జగదాంబ జంక్షన్ మరియు కింగ్ జార్జ్ హాస్పిటల్ నందు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. కూటమి నాయకులు అందరూ కలిసి జగదాంబ జంక్షన్ 29 వ వార్డు పరిధిలో గల మహిళలకు చీరలు మరియు పళ్ళు పంపిణీ చేసారు. ఊరుకుటి నారాయణ రావు కార్పొరేటర్ మరియు బుధల అనురాధ 29 వ వార్డు జనసేన మన్యాల శ్రీనివాస్,29 వ వార్డు ప్రెసిడెంట్ అంగటి శ్రవణ్ కుమార్ బీజేపీ ప్రెసిడెంట్ శేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ కు చెందిన సీనియర్ నాయకులు సమక్షంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.

previous post