ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మే 2న జరిగే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా, అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు దంపతులు మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం, అమరావతిలో ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

previous post
next post