Tv424x7
Andhrapradesh

1.34 లక్షల కోట్ల ఆదాయమే టార్గెట్‌.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఏంటో తెలుసా….?

అభివృద్ధిలో ఏపీని టాప్‌లో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? అవుతున్న ఖర్చు ఎంత? అనేదానిపై అధికారులతో లెక్కలు తీసుకొని రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు.బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ..బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే ముందున్నా పన్ను ఆదాయం ఆస్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని… పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని… ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.అంతర్జాతీయంగా ఎర్రచందనం అమ్మకానికి కమిటీఅంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనం విక్రయాలకు, దాని విలువ నిర్ధారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం ఏపీ రాష్ట్రానికి మాత్రమే సొంతమని.. దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవచ్చని అన్నారు. కమిటీ ద్వారా ఎర్రచందనం నిల్వలు, వాటి విలువపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే… ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు తక్కువుగా ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే, సరైన విధానాలను అవలంభించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. మొత్తంగా ఏపీలో ఆదాయం ఈ ఏడాది బాగా పెంచుకోవాలని బాబు చేసిన సూచనలతో అధికారులు ఆ దిశగా భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

Related posts

నకిలీ భారత పాస్‌పోర్టును ఉపయోగించి రష్యాకు వెళ్లిన బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో వైసిపి నుండి టీడీపీలో చేరిన రఫీక్ కుటుంభం మరియు 200 మంది కార్యకర్తలు.

TV4-24X7 News

కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు

TV4-24X7 News

Leave a Comment