Tv424x7
Andhrapradesh

సుప్రీంలో మద్యం కుంభకోణం నిందితులకు చుక్కెదురు

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. వీరికి గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ తీర్పును కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పార్థీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.

Related posts

మహాలక్ష్మి నాయుడుకు ఐదువేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం.

TV4-24X7 News

*ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలు….

TV4-24X7 News

Leave a Comment