Tv424x7
Andhrapradesh

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యాబోతున్నారా.?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అరెస్ట్ చేస్తారు అని ఒక్క తీరున సోషల్ మీడియా కోడై కూస్తోంది. అలాగే టీడీపీ అనుకూల మీడియా డేటూ టైం ఫిక్స్ చేసి మరీ ఫీలర్స్ వదులుతోంది.బాబుని 2023 సెప్టెంబర్ 10న నంద్యాల నుంచి విజయవాడకు ఎలా తీసుకుని వచ్చారో అలాగే జగన్ ని బెంగళూరులో ఉన్నపుడు ఆయనను అరెస్ట్ చేసి ఆ విధంగానే రోడ్డు మార్గం గుండా గంటల పాటు తిప్పి తీసుకుని వస్తారని కూడా వార్తలు వండి వారుస్తున్నారు.మొత్తానికి బాబు అరెస్ట్ కి జగన్ అరెస్టు కి ముడి పెడుతూ కధనాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. లిక్కర్ స్కాం లో జగన్ అరెస్ట్ అనివార్యం అన్నట్లుగా కూడా కొన్ని మీడియా చానళ్ళు అయితే జోస్యాలు చెబుతున్నాయి. ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ఎవరికీ తెలియని విషయం. అరెస్ట్ అన్నది ఒక రాజకీయ ప్రముఖుడు అందునా అయిదేళ్ళ పాటు ఏపీని ఏలిన ముఖ్యమంత్రిని విషయంలో చాలా పెద్దదిగానే చూడాలని అంటున్నారు. దీనిని ఎవరూ లైట్ గా తీసుకోరని అన్ని విధాలుగా ఆలోచిస్తారు అని అంటున్న వారూ ఉన్నారు. ఈ విధంగా రాజకీయ వార్తలతో రాజకీయ విశ్లేషణలతో ఏపీ ఒక వైపు వేడెక్కిపోతున్న నేపధ్యంలో జగన్ ఏమి చేస్తున్నారు అన్నది అందరికీ ఉంటుంది.అయితే జగన్ కి ఇది తొలి అరెస్ట్ కాదు, అంతే కాదు ఆయన గతంలో 16 నెలల పాటు ఉన్నారు ఇక జగన్ ఎపుడూ దేనికైనా సిద్ధం అన్నట్లుగానే ఉంటారని అంటున్నారు. దాంతో ఆయనకు ఈ పర్యవసానాలు అన్నీ తెలుసు అని ఆయన అందుకే తన పార్టీని చక్కదిద్దుకోవడం మీదనే ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.ఈ మధ్య జగన్ తాడేపల్లిలో పార్టీ నాయకులతో వరస మీటింగ్ పెడుతున్నారు ఆ సమావేశాలలో ఆయన ఒక్క మాట చెబుతున్నారు. పార్టీ మీది మీరే యజమానులు అని అంటే పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీదే బాధ్యత. మీరే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అంటున్నారుజిల్లాల అధ్యక్షులకు ఇపుడు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు అని అంటున్నారు అంటే వారే ఆలోచించుకుని తమ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు అయినా ఆందోళనలు నిరసనలు అయినా చేపట్టవచ్చు అని అంటున్నారు. ఇక జగన్ అరెస్ట్ అయితే కనుక మొత్తం ఏపీలో ఉన్న 26 జిల్లాలలోని వైసీపీ క్యాడర్ యాక్టివేట్ అయ్యేలా కూడా అధినాయకత్వం స్పష్టమైన విధంగా దిశా నిర్దేశం చేసింది అని అంటున్నారు.దాంతో వైసీపీ ఈసారి జగన్ అరెస్ట్ అన్న అతి పెద్ద రాజకీయ ప్రకంపనన్ను ఏ విధంగా ఫేస్ చేస్తుంది అన్నది ఒక వైపు చర్చగా ఉంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం పార్టీ నాయకుల మీదనే భారాలు అన్నీ వేసి వారికే అన్నీ అప్పగిస్తోంది అని అంటున్నారు. పార్టీలో 36 మంది దాకా పీయేసీ మెంబర్స్ ఉన్నారు. అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లు పది మంది దాకా ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు.రాష్ట్ర కమిటీలు అనుబంధ కమిటీలు ఇల్లా చూస్తే వందలలో నాయకత్వం ఉంది. ఇక జిల్లాల నుంచి దిగువ స్థాయిలో చూసుకుంటే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జిలను నియమించారు. అలాగే మండల, గ్రామాలలో కూడా పార్టీ కమిటీలు వేస్తున్నారు. ఈ విధంగా పార్టీ స్ట్రక్చర్ ని గట్టిగా ఉండేలా చేస్తే కనుక ఏ రకమైన ఉపద్రవం వైసీపీకి వచ్చినా బలంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు అన్నదే పార్టీ హైకమాండ్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

Related posts

నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

TV4-24X7 News

అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలు- ఒకే ఇంటి నంబరుపై వందకు పైగా ఓట్లు!

TV4-24X7 News

సీతం రాజు సుధాకర్ ని కలసి హృదయ పూర్వక అభినందనలు తెలియజేసిన బత్తిన నవీన్ కుమార్

TV4-24X7 News

Leave a Comment