కడప /మైదుకూరు : దువ్వూరు మండలం,చింతకుంట సర్పంచ్ కోగటం వీరారెడ్డిని పరామర్శించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఇటీవల ఆరోగ్యం బాగాలేదని హైదరాబాదులో చికిత్స పొంది ఇంటికి వచ్చిన చింతకుంట సర్పంచ్ వీరారెడ్డిని పరామర్శించి వైద్యులు చెప్పిన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు, సంఘన హరినాథ్ రెడ్డి, మైదుకూరు నియోజకవర్గ వైకాపా యూత్ అధ్యక్షులు యేమిరెడ్డి చంద్ర ఓబులరెడ్డి, గుడిపాడు ఎంపీటీసీ సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతకుంట ఎంపీటీసీ సభ్యులు ఖాదర్ బాషా, గుడిపాడు సర్పంచ్ రాజుపాలెం మహబూబ్ షరీఫ్, వైకాపా నాయకులు గుర్రాల రామ మునిరెడ్డి, శేఖర్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా, తదితరులు పరామర్శించారు.