ఏపీ: వైసీపీ అధినేత జగన్కు వ్యతిరేకంగా తాను తిరుపతి, వైజాగ్ లో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ విజయసాయి ఖండించారు. ‘జగన్ కు వ్యతిరేకంగా నేనెక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ ఆయనకు హాని కలిగేలా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఎవరితో నాకు శత్రుత్వం లేదు. నేనేం మాట్లాడాలనుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా’ అని ట్వీట్ చేశారు.
