విశాఖపట్నం ఈరోజు ఎస్ జీ ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,తమ సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, (విశాఖపట్నం) బ్రాంచి వారు, నగరంలో ఉన్న వానప్రస్థ వృద్ధాశ్రమ వసతి లో ఉన్న నిరుపేద వృద్ధులకు, వృద్ధ మాతృమూర్తులకు, ఎస్ జీ ఎస్ ఇండియా వారు( సి ఎస్ ఆర్ ) కార్పొరేట్ సామాజిక బాధ్యత తో నెలరోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు,పండ్లు,ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస రావు కి అందజేసినారు, ఈ కార్యక్రమంలో ఎస్ జీ ఎస్ ఇండియా డైరెక్టర్ మెహర్ ,బ్రాంచి మేనేజర్ హైగ్రీవ రావు , ల్యాబ్ మేనేజర్ నరేంద్ర , పట్టాభి , శ్రీవాత్సవ్ , శ్రీనివాస్ ,రామారావు , ఉమా మహేష్ ,మరియు గౌరవ్, నాయుడు, నరేష్, రమేష్, సహఉద్యోగులు, ఆనంద్, శ్రీనివాసరావు, రాంకుమార్, వెంకటరావు,వీర్రాజు, నరేష్,సురేష్,తదితరులు, పాల్గొన్నారు.
