విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ వారి చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగినది అలాగే ప్లాస్టిక్ నివారణపై అవగాహన సదస్సు పెట్టి పూర్ణ మార్కెట్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు ప్లాస్టిక్ గుడ్డ సంచలనే వాడుదాం అనే నినాదాలతో ర్యాలీ చేయడం జరిగినది కార్యక్రమంలో 35 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొచ్చారామిరెడ్డి 35 వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ భఠీ మంగరాజు వార్డ్ సానిటరీ ఇన్స్పెక్టరు శివప్రసాద్ వార్డ్ సానిటరీ సిబ్బంది పలువురు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.
