Tv424x7
Andhrapradesh

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు రాష్ట్ర సమాచార కమిషన్ షో కాజ్ నోటీసులు జారీ

వాకీ టాకీల పేరుతో 27 లక్షల ప్రజాధనం లూటీ – సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన అధికారుల అవినీతి

విజయవాడ :- ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ షో కాజ్ నోటీసులు జారీ చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ సిబ్బంది విధుల సౌలభ్యం కొరకు 20 వాకీ టాకీలు కొనుగోలు చేసిన వ్యవహారం సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో మలుపు తిరిగింది. బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన జర్నలిస్ట్, ఆర్టిఐ కార్యకర్త నాయుడు నాగార్జున రెడ్డి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సమాచార అధికారికి గత సంవత్సరం ఆగస్టు 19వ తేదీన చేసుకున్న దరఖాస్తు వ్యవహారంలో కార్పొరేషన్ అధికారులు ద్వంద్వ ప్రమాణాలతో పరస్పర విరుద్ధమైన తప్పుడు సమాచారం ఇవ్వడంతో నాగార్జున రెడ్డి రాష్ట్ర సమాచార కమిషన్అ కు ప్పీలు చేశారు. ఆపిల్ పై విచారణ జరిపిన రాష్ట్ర సమాచార కమిషనర్ సిహెచ్ సునీల్ అప్పిలదారుడు నాగార్జున రెడ్డి వాదనలు పరిగణనలోనికి తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులు తనిఖీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 2, 4 తేదీలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత రికార్డులు తనిఖీలు నిర్వహించిన సందర్భముగా వాకి టాకీలు కొనుగోలు చేసిన వ్యవహారానికి సంబంధించిన ఫైల్స్, మెజర్మెంట్ బుక్స్ పరిశీలించడం జరిగింది. *అసలు జరిగిందేమిటంటే…*వాస్తవానికి టెండర్ వేయాల్సిన 27 లక్షల రూపాయల వాకి టాకీల కొనుగోలు వ్యవహారం లో, అధికారులు వారి అనుభవాన్ని రంగరించి ఉత్తర్వుల మేరకు నామినేటెడ్ టెండర్ ద్వారా కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. 27 లక్షల రూపాయల గ్రాంటును ఆరు పద్దులుగా విభజించి ప్రజాధనం లూటీ చేశారు. టెండర్ విధానం అనుసరించకుండా మహారాష్ట్రలోని పూణే కి చెందిన శీతల్ వైర్లెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో ఆరు దఫాలు 27 లక్షల అరవై వేలు చెల్లించినట్లుగా రికార్డులు సృష్టించారు.*షో కాజ్ నోటీసులు జారీ…*శుక్రవారం ఉదయం మంగళగిరి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన రెండవ అప్పిలు విచారణ సందర్భంగా, అప్పీల్ నాగార్జున రెడ్డి వాదనలను పరిగణనలోనికి తీసుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్ సిహెచ్ సునీల్ వాకీ టాకీలు కొనుగోలు వ్యవహారంలో సంబంధం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరికీ షోకాజు నోటీసులు జారీ చేయవలసిందిగా ఆదేశిస్తూ, తదుపరి విచారణకు 27 లక్షల రూపాయల వాకీటాకీలు రికవరీ, ఈ వ్యవహారంలో కార్పొరేషన్ చేపట్టిన యావత్తు చర్యలు తాలూకు నివేదికతో హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు.*చీరాల మున్సిపాలిటీలో కూడా ఇదే తీరు…*పారిశుద్ధ్య కార్మికుల సౌలభ్యం కోసం వాకీటాకీలు కొనుగోలు పేరుతో 2019 సంవత్సరంలో 20 లక్షల రూపాయలు ప్రజాధనం లూటీ చేశారు. చిత్తూరులో అడ్రస్ కూడా లేని ఒక ప్రైవేటు సంస్థ నుండి వాకి టాకీలు కొనుగోలు చేసినట్లు, అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదేశాల మేరకు సదరు వాకీ టాకీలను కలెక్టర్ కార్యాలయానికి అందజేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ప్రజల సొమ్మును మున్సిపల్ అధికారులు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధి, కొంతమంది కౌన్సిలర్లు 20 లక్షల రూపాయలను తమ జేబులు నింపుకున్నారు.

Related posts

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

TV4-24X7 News

పేద కుటుంబానికి సహాయం చేసిన ప్రెండ్స్ సేవ సంస్థ

TV4-24X7 News

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

TV4-24X7 News

Leave a Comment