పార్వతీపురం: రేపు పద్మభూషణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజును పురస్కరించుకుని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. చినబొండపల్లిలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం అనంతరం పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే విజయచంద్రకు తినిపించారు. నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, బాలకృష్ణ గారి అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
