Tv424x7
National

కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్…

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదంలండన్ వెళుతున్న విమానం కుప్పకూలిన వైనంవిమానంలో 242 మంది ప్రయాణికులు… వారిలో 53 మంది బ్రిటన్ జాతీయులుసలిపోవడంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందనఘటన దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయన్న స్టార్మర్పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడిలండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన ఘటనపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలింది. ఇందులో 242 మంది ఉండగా, వారిలో 53 మంది బ్రిటన్ పౌరులే.ఈ ఘటనపై కీర్ స్టార్మర్ ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. “భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో, లండన్ బయల్దేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు వివరిస్తున్నారు. ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయి” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Related posts

18 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్న మోదీ

TV4-24X7 News

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

TV4-24X7 News

దిగ్గజ పారిశ్రామిక వేత్త టెస్లా..ప్రధానితో భేటీ

TV4-24X7 News

Leave a Comment