Tv424x7
Andhrapradesh

తల్లికి వందనం పథకం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు : ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎద్దు రాహుల్, వీరపోగు రవి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా తల్లికి వందనం పథకం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని శనివారం కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ కడప నగరికి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎద్దు రాహుల్, వీరపోగు రవి. అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కుటుంబంలో ఒకటి నుంచి 12 వరకు తరగతి చదువుతున్న ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పడం సిగ్గుచేటని అదేవిధంగా 2024-25 సంవత్సరం సంబంధించి తల్లి వందనం పథకం బురుడి కొట్టించి తల్లిదండ్రులు మోసం చేశారని.ప్రస్తుతం 2025 -26 సంవత్సరం సంబంధించి 15 వేల ఇస్తామని తల్లుల అకౌంట్ లోకి 13 వేల రూపాయలు జమ చేసి 2 వేల రూపాయలు స్కూలు కాలేజీల అభివృద్ధి పనుల కోసం మినహాయింపు ఇస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చూస్తుంటే వారే ఇచ్చి వారే లాక్కుంటే ఇవ్వడం దండగని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ బడులలో చదువుతున్న విద్యార్థుల వద్ద వసూలు చేసే డబ్బును ఆ విద్యా సంస్థల అభివృద్ధి ఉపయోగిస్తుందా అంటే ప్రైవేట్,కార్పొరేట్ బడులను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వాన్నిగా అని ఎద్దేవా చేశారు. దానితోపాటు అనేక అసంబద్ధ నిబంధనలు పేరుతో విద్యార్థుల సంఖ్యను కుదింపు చేయడానికి ఖండిస్తున్నామని వారు తెలిపారు. కరెంటు 300 యూనిట్లు వినియోగిస్తే అర్హులు కారు అనే నిబంధనలను గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాలని మరి ఇప్పుడు అతను అధికారంలోకి వచ్చిన వెంటనే అతనే మరలా అదే నిబంధనలను కొనసాగిస్తున్నారు. దానితోపాటు ఫోర్ వీలర్ వెహికల్ నిబంధనలను తీసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో పాఠశాల డిగ్రీ చదివే విద్యార్థులు ఉంటే ఒకరికి మాత్రమే ఏదైనా పథకం వర్తిస్తుందని ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఫీజు రియంబర్స్మెంట్ కి లింకు పెట్టడం సరికాదని అన్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు అభినయ్, రోని,మోహన్, నగర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు ఖాసిం పీర్, శ్రీకాంత్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీతారామరాజు సుధాకర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బత్తిన నవీన్

TV4-24X7 News

మోత మోగిస్తున్న మద్యం ధరలు

TV4-24X7 News

128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TV4-24X7 News

Leave a Comment