విజయవాడ _ బహుజన్ న్యూస్ -ప్రతినిధి (టి.జి )ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేయడం తప్ప ప్రజలకు చేసిన మేలేమి లేదు – వెలంపల్లి. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం – వెలంపల్లి. పశ్చిమలో అభివృద్ధి కుంటుపడింది – వెలంపల్లి.నాడు నేను చేసిన శంకుస్థాపనలను నేడు కూటమి నేతలు ప్రారంభిస్తూ శునకానందం పొందుతున్నారు – వెలంపల్లి.చంద్రబాబు హయాంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది తప్ప ప్రజా సంక్షేమ పాలన నడవదు – వెలంపల్లి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైకాపా మీడియా సెల్ రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త వెలంపల్లి శ్రీనివాసరావు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలోని వైకాపా నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేసిన వైఫల్యాలను ప్రజలకు తెలిసే విధంగా ఈ పుస్తాకాన్ని రూపొందించడం జరిగిందని ఈ పుస్తకం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మాత్రం అమలు జరిగాయి అనే అంశాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు జగన్ అంటే నమ్మకం అనేటువంటి పరిపాలన సాగిందని నేడు చంద్రబాబు అంటే మోసం అనే పరిపాలన సాగుతుందని అన్నారు. చంద్రబాబు చేసే మోసాలను సాక్ష్యాలతో కూడినటువంటి వివరణ ప్రజలకు తెలియజేసేందుకు నడుం బిగించామన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతును అణిచివేయడం తప్ప ప్రజలకు చేసిన మేలేమి లేదన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిఒక్కరిని అణిచివేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వము చేసిందన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఈ ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీ, రైతుభరోసా, విద్యాదీవెన వంటి ప్రజా సంక్షేమ పధకాలను నిర్వీర్యం చేశారన్నారు. లక్ష యాభై వేల కోట్లు రాష్ట్రానికి అప్పు చేసి ఏమి సాధించారని ప్రశ్నించారు. ఒక్క సంక్షేమ పధకమైన అమలు చేసారా అన్నారు. జగన్ హయాంలో కుల మాత ప్రాంత కారతమ్యం లేకుండా సంక్షేమ పధకాలు అందించారని గుర్తుచేశారు. నేటి ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకుండేటువంటి నాయకులే లేరన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం సూన్యమన్నారు. పశ్చిమలో అభివృద్ధికుంటుపడిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని, ప్రజలను పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు.నా హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారమే లేదన్నారు. నాడు నేను చేసిన శంకుస్థాపనలను నేడు కూటమి నేతలు ప్రారంభిస్తూ శునకానందం పొందుతున్నారన్నారు.కూటమి పాలను అణిచివేసే విధంగా ప్రజలతో కలిసి రానున్న రోజులలో పోరాటం చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న విధ్వంసాలను ప్రజలకు తెలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికన్నా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి సంక్షేమ పధకాలను అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని విజ్ఞప్తి చేసారు. చంద్రబాబు హయాంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది తప్ప ప్రజ సంక్షేమ పాలన నడవదన్నారు. అరెస్టులతో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఆపలేరని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో పశ్చిమ కార్పొరేటర్లు బండి పుణ్యశీల, మండెపూడి ఛటర్జీ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, ఇర్ఫాన్, పడిగిపాటి చైతన్య రెడ్డి, బాపతి కోటిరెడ్డి, గోదావరి గంగ,శిరంశెట్టిపూర్ణచంద్రరావు, హయత్, దుర్గ గుడి మాజి చైర్మన్ కర్నాటి రాంబాబు, జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజి చైర్మన్ గౌస్ మొహిద్దీన్, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్, బొందిలి నరేంద్ర సింగ్, వైసిపి రాష్ట్ర, జిల్లా మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

previous post