ఢిల్లీ నుంచి రాయ్పూర్ చేరుకున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇందులో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ కూడా ఉన్నారు. టెక్నికల్ సమస్యతో 40 నిమిషాల పాటు ఫ్లైట్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. తర్వాత డోర్లు తెరుచుకోవడంతో అందరూ సురక్షితంగా కిందకి దిగారు. కాగా ఇటీవల అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే.

previous post