హైదరాబాద్:ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ జరగనుంది.
➡️ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు.
➡️ ఈ సభకు రాహుల్ గాంధీ, ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది.
➡️ బీసీల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలను విస్తృత స్థాయిలో ప్రజలకు తెలియజేయడమే ఈ విజయోత్సవ సభ లక్ష్యంగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Anusha