Tv424x7
Andhrapradesh

వికలాంగులకి ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్లు ఉపకరణాలు పంపిణీ – ఎమ్మెల్యే పి_రవీంద్రనాథ్_రెడ్డి

కమలాపురం :- దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈరోజు అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు మంజూరైన బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌ చైర్లు వంటి ఉపకరణాలు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 1203 మందికి 17 రకాల 1823 ఉపకరణాలు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగులకు ఉపకరణాలు శారీరక ఉన్నత ని పెంచుతాయన్నారు. ప్రభుత్వం చొరవ చూపి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన ట్రైసైకిళ్లను ఇతర ఉపకరణాలను పంచడం శుభపరిణామం అన్నారు. జిల్లాలోని అత్యధికంగా 1203 మందికి మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెన్షన్లతోపాటు ఇలాంటి దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.యమ్.యల్.ఎను శాల్వతో సత్కరించారు. ట్రై సైకిల్ లు పంపిణీ

Related posts

వర్రా అసభ్యకర పోస్టులు.. తాడేపల్లి కార్యాలయం నుంచే: డీఐజీ ప్రవీణ్‌..

TV4-24X7 News

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

TV4-24X7 News

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

TV4-24X7 News

Leave a Comment