దువ్వూరు, మే 21: వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం–1లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా సచివాలయంలోని ప్రింటర్ పనిచేయకపోవడంతో వివిధ ప్రభుత్వ సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.సచివాలయానికి వివిధ ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు), ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, రశీదుల ప్రింట్ల కోసం వచ్చే ప్రజలు పనులు పూర్తి కాక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే అందిస్తామని చెబుతున్నా, చిన్న ప్రింటర్ మరమ్మతును కూడా రోజులు తరబడి పట్టించుకోకపోవడం బాధాకరం” అని స్థానికులు విమర్శిస్తున్నారు.అధికారులు తక్షణమే స్పందించి ప్రింటర్ మరమ్మతు చేయడం లేదా కొత్త ప్రింటర్ ఏర్పాటు చేసి సచివాలయ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039

