హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని పేర్కొన్న సీఎం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, వారి నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజనకార్మికులను అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్గా నాలుగు విభాగాలుగా విభజించామని సీఎం తెలిపారు. అలాగే వర్క్ జోన్లను మూడు భాగాలుగా విభజించి కనీస వేతనాలను నిర్ణయించినట్లు చెప్పారు.కొత్త కనీస వేతనాలు ఇవే:
✅ అన్స్కిల్డ్: రూ.12,750 నుంచి రూ.16,000
✅ సెమీ స్కిల్డ్: రూ.13,152 నుంచి రూ.17,000
✅ స్కిల్డ్: రూ.13,772 నుంచి రూ.18,500
✅ హైలీ స్కిల్డ్: రూ.14,607 నుంచి రూ.20,000ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని సీఎం వెల్లడించారు. కొత్త వేతనాలు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.యువతకు సీఎం సూచన“ఐటీ, అమెరికా మాత్రమే కాదు.. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు రాని చదువుల కంటే నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి” అని యువతకు సీఎం సూచించారు.అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, రైతుల అంశంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలపై సీఎం విమర్శలు చేశారు.
తెలంగాణ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కనీస వేతనాల పెంపు!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని పేర్కొన్న సీఎం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, వారి నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.నాలుగు కేటగిరీలుగా కార్మికుల విభజనకార్మికులను అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్గా నాలుగు విభాగాలుగా విభజించామని సీఎం తెలిపారు. అలాగే వర్క్ జోన్లను మూడు భాగాలుగా విభజించి కనీస వేతనాలను నిర్ణయించినట్లు చెప్పారు.కొత్త కనీస వేతనాలు ఇవే:✅ అన్స్కిల్డ్: రూ.12,750 నుంచి రూ.16,000✅ సెమీ స్కిల్డ్: రూ.13,152 నుంచి రూ.17,000✅ స్కిల్డ్: రూ.13,772 నుంచి రూ.18,500✅ హైలీ స్కిల్డ్: రూ.14,607 నుంచి రూ.20,000ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని సీఎం వెల్లడించారు. కొత్త వేతనాలు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.యువతకు సీఎం సూచన“ఐటీ, అమెరికా మాత్రమే కాదు.. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లోనూ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు రాని చదువుల కంటే నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి” అని యువతకు సీఎం సూచించారు.అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, రైతుల అంశంపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలపై సీఎం విమర్శలు చేశారు.

