Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – 84 మంది లబ్ధిదారులకు రూ.71.20 లక్షల ఆర్థిక సహాయం

కడప / మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, 84 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.71,20,390 విలువైన చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద మరియు అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

బెయిల్ వచ్చినా….. ప్రభుత్వం జైల్లోనే ఉంచ్చారంట…..

TV4-24X7 News

ఘనంగా అష్టదళ పద్మారాధన

TV4-24X7 News

పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

TV4-24X7 News

Leave a Comment