2024 Elections: తనపై వస్తున్న విమర్శలపై సిన్హా స్పందిస్తూ.. ”నేను అన్నింటినీ భగవంతుడికి నా అభిమానులకు వదిలివేస్తున్నాను. నాపై అభియోగాలు మోపారు. నన్ను దేశద్రోహి అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు” అని అన్నారు..ఇంకా ఆయన మాట్లాడుతూ ”ప్రతాప్ సిన్హా దేశద్రోహినా, దేశభక్తుడా అనేది మైసూరు కొండలపై కూర్చున్న మాత చాముండేశ్వరి, బ్రహ్మగిరిపై కూర్చున్న కావేరీ మాత నిర్ణయిస్తారు. గత 20 ఏళ్లుగా నేను రాసిన పుస్తకాలను చదువుతున్న కర్ణాటకలోని నా అభిమానులు, గత తొమ్మిదిన్నరేళ్లుగా నా కృషిని చూస్తున్న మైసూరు, కొడగు ప్రజలు నిర్ణయిస్తారు. దేశం, మతం, జాతీయవాదానికి సంబంధించిన సమస్యలపై నా ప్రవర్తన ఏప్రిల్ 2024లో జరిగే లోక్సభ ఎన్నికలలో పోలైన ఓట్ల ద్వారా నిర్ణయించబడుతుంది” అని అన్నారు..

previous post
next post