Tv424x7
Andhrapradesh

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు..ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో వేలకొద్దీ నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. మార్చి 2021లో జరిగిన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో నకిలీ ఓట్లు పోలయ్యాయని లేఖలో ఫిర్యాదు చేశారు. EPIC కార్డుల డిజిటల్ ప్రింట్‌ అవుట్ల డేటాను కూడా సమర్పించారని.. అందులో 35000 ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్‌లోడ్ చేశారని తేలిందన్నారు. డీఈవో ఇచ్చిన సమాచారం మేరకు క్రిమినల్‌ కేసు నమోదు చేశారని పురంధరేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు..

Related posts

నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

TV4-24X7 News

ఆర్వో సీల్ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లు తిరస్కరించవద్దు: ఈసీ

TV4-24X7 News

అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగం దారుణం :- వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

Leave a Comment