20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మండల కేంద్రమైన దువ్వూరులోని ఎంపీడీవో సభా భవనం నందు వాలంటీర్ల సన్మానము జరుగును. ఇద్దరు వాలంటీర్లకు ఒక్కొక్కరికి 45 వేల రూపాయలు, 5 మంది వాలంటీర్లకు 30వేల రూపాయలు,251 మంది వాలంటీర్లకు 15 వేల రూపాయలు వారి వారి ఖాతాలలో జమ అవుతుందని వారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించబడునని, ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామి రెడ్డి సన్మాన సభకు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. కావున మండలంలోని ముఖ్య నేతలు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పిటిసి,ఎంపీపీ,ముఖ్య నాయకులు,సచివాలయం వాలంటీర్లు,సర్పంచ్, ఎంపీటీసీ,సమావేశమునకు హాజరు కావలెను,కావున ప్రతి ఒక్క ముఖ్య నాయకులు అందరూ దువ్వూరులోని ఎంపీడీవో కార్యాలయంనకు రావలసిందిగా ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి (JCS మండల కన్వీనర్) తెలియచేసారు
