నీట్ అంశంపై రాజకీయాలు చేయొద్దు: బండి సంజయ్

పేపర్ లీకేజీపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు.. తెలంగాణలో లీక్ అయితే కేసీఆర్ రాజీనామా చేశారా? అంటూ ప్రశ్న

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

హైదరాబాద్, జూలై 26: నీట్ పరీక్ష అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో జరిగిన పరిణామాలు, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందించారు.

 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. నీట్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.

 

పేపర్ లీకేజీపై తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం రాజీనామా చేసిందా? అని ప్రశ్నించిన బండి సంజయ్, “తెలంగాణలో పేపర్ లీక్ అయితే కేసీఆర్, మంత్రులు రాజీనామా చేశారా?” అంటూ విమర్శించారు.

 

నీట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేపడుతున్నామని తెలిపారు. సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిందని చెప్పారు.

 

విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా తక్కువ సమయంలోనే తిరిగి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు.

 

అలాగే ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల వెనుక కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *