శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. కృష్ణమ్మ జలకళ!

శ్రీశైలం: ఎల్‌నినో ప్రభావంతో రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగి శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతోంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం సుమారు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అధికారులు దాదాపు 30,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. అలాగే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా నీటి విడుదల కొనసాగుతోంది.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 18,349 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 823.70 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వరద ప్రవాహం నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో ప్రాజెక్టులకు వరద నీరు చేరుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *