ప్రియురాలి దారుణ హత్య.. సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన ప్రియుడు

విశాఖపట్నం: విశాఖలో సంచలనం రేపిన ఘటనలో ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తిని ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ (32)కు పెందుర్తికి చెందిన సంధ్య (20)తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గత నెల 15న సంధ్య తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన సురేష్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జగదాంబ సెంటర్‌లో పెద్ద సూట్‌కేస్ కొనుగోలు చేసి, మృతదేహాన్ని అందులో ఉంచి రైలు ద్వారా ఒడిశాలోని రాయగడ జిల్లా జేకేపూర్ సమీప అటవీ ప్రాంతంలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అటవీ ప్రాంతంలో సూట్‌కేస్ నుంచి దుర్గంధం రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. విశాఖపట్నం పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయగడ కోర్టుకు తరలించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Prev అమరావతి: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జూలై 31తో ముగియాల్సిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి కారణాలతో పంట నష్టం జరిగితే ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలకమని మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఆగస్టు 15లోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని సూచించారు. సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *