బెట్టింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి సినీ నటి నిధి అగర్వాల్‌ను ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.బెట్టింగ్‌కు సంబంధించిన ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రచారం చేశారనే ఆరోపణలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా ప్రచార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, తనకు అందిన పారితోషికం తదితర అంశాలపై వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణాన్ని కూడా ఈడీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారంలో ప్రముఖుల పాత్ర, వాటి ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసు ఆధారంగా ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అయితే ఈడీ విచారణకు సమన్లు అందుకోవడం మాత్రమే నేరం రుజువైనట్లు కాదు. దర్యాప్తులో భాగంగా నిధి అగర్వాల్‌ నుంచి అధికారులు వివరాలు, వాంగ్మూలం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *