కడప /
దువ్వూరు: మండల కేంద్రమైన దువ్వూరు సమీపంలోని పాత దువ్వూరులో వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పణి సుజాయశీల, అర్చకులు భూమరాజు నరసింహయ్య తెలిపారు.ఆలయ ఈవో, అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.అయితే ప్రతి ఒక్కరూ స్వయంగా ఏర్పాట్లు చేసుకుని వ్రతాన్ని నిర్వహించుకోవడం సాధ్యం కాకపోవచ్చని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: